Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ పూర్ణిమ.. భద్ర సమయంలో రాఖీ కట్టకండి..

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (19:07 IST)
పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ అంటారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, గురువారం. ఈ రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రావణపండుగను జరుపుకుంటారు. పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు చెల్లుతుంది. 
 
ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆగష్టు 11న వస్తుంది. ఈ ఏడాది రక్షాబంధన్ కూడా ఆగస్టు 11న జరుపుకోనున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం 08:51 భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో మీరు రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ ఘడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. 
 
రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తరువాత లంక చెడు దశ ప్రారంభమైంది. రావణుడికి దురదృష్టం మొదలైందని చెబుతారు.
 
అందుకే సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి. అంటే 08:51 రాత్రి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 12 ఉదయం 07: 05 వరకు కట్టండి. కొన్ని నిబంధల మినహా సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments