మహాభారతంలో లాక్‌డౌన్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..? (video)

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (20:03 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్లు, లాక్ డౌన్ గురించే చర్చ సాగుతోంది. అలాంటి ఈ లాక్ డౌన్ ప్రస్తావన.. మహాభారతంలోనే వుందని తెలిసింది. మహాభారత యుద్ధంలో లాక్ డౌన్ గురించి ప్రస్తావన వుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్యుడిని చంపడంపై ద్రోణుని కుమారుడు అశ్వత్థామ ఆగ్రహావేశానికి గురయ్యాడు. అతను పాండవ సేనపై ఆవేశంతో నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. దీనికి మరో ఉపాయం లేదు. 
 
ఈ అస్త్రం యుద్ధానికి సిద్ధమయ్యే వారిపై, ఆయుధం చేతబూనిన వారిని హతమార్చుతుంది. ఇంకా అగ్ని వర్షాన్ని కురిపిస్తుంది. దీంతో మరణం తప్పదు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని, ఆయుధాలను దాచి అందరినీ వారి వారి గృహాలకే పరిమితం చేశారు. అంతేగాకుండా నారాయణ అస్త్రం దగ్గరికి వస్తే చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించాడు. 
 
అంతేగాకుండా మనస్సులో యుద్ధం చేసే యోచన కూడా రాకూడదని.. అందరూ తమ ఆయుధాలకు దూరంగా గృహాలకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశాడు. అలా నారాయణ అస్త్రం తన సమయం ముగిసిన పిమ్మట శాంతించింది. ఈ విధంగా నారాయణ అస్త్రం నుంచి శ్రీకృష్ణుడు పాండవ సేనను రక్షించాడు. ఈ పద్ధతే ప్రస్తుతం కరోనాకు వర్తిస్తుంది. లాక్ డౌన్‌లలో ప్రస్తుతం ప్రజలంతా చాలామటుకు ఇంటికే పరిమితం అయ్యారు. 
 
కరోనాతో యుద్ధం చేయలేక తమను తాము రక్షించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో యుద్ధం చేయలేక జనం వ్యాక్సినేషన్ల కోసం వేచి చూస్తున్నారు. శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు చేస్తూ కాలం గడుపుతున్నారు. కరోనాపై అస్త్రం ప్రయోగించలేకపోతున్నారు. 
 
కరోనా నుంచి తప్పించుకోవడం కోసం కొద్దికాలం అన్నీ పనులను వదిలి ప్రశాంతంగా మనస్సును సిద్ధం చేసుకుంటున్నారు. ఒత్తిడికి దూరం అవుతున్నారు. ఇంటికే పరిమితమై కరోనా నుంచి తప్పించుకునే దిశగా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తున్నారు.  అదన్నమాట సంగతి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments