కార్తీక సోమవారం.. శివాలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (11:08 IST)
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం.. అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతిఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు.

కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులూ పండుగదినాలే. దేశ నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.
 
ఇక, కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మళ్లికార్జున స్వామివారి సాధారణ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. 
 
కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం కావడంతో శివాలయాలను దర్శించడం శుభం. ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు. ఇంకా కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే... మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. 
 
అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖం గల దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments