Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

ఐవీఆర్
ఆదివారం, 26 జనవరి 2025 (23:29 IST)
భారత ప్రభుత్వం దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. వైద్య రంగంలో నాగేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని అంతర్జాతీయంగా కూడా నాగేశ్వరరెడ్డి గుర్తింపు తెచ్చుకుని తెలుగువారందరికి గర్వకారణంగా నిలిచారని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే నందమూరి బాలకృష్ణ.. నటుడిగా, ప్రజా ప్రతినిధిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సమాజ సేవకుడిగా చేస్తున్న పనులకు పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించడం అభినందనీయమని తెలిపారు.
 
కళారంగం నుంచి  ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, సాహిత్యం విద్యారంగం నుంచి కె.ఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, సామాజిక రంగం నుంచి మందకృష్ణ మాదిగ లకు పద్మ పురస్కారాలు వరించడంపై అమెరికాలో ఉండే తెలుగు వారందరికి సంతోషంగా ఉందన్నారు. పద్మ పురస్కారాలు సాధించిన తెలుగువారికి అమెరికాలో ఉండే తెలుగువారి తరపున నాట్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు నాట్స్ చైర్మన్ ప్రశాంత్  పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments