Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్ టెంపాబే విభాగంలో ఆధ్వర్యంలో నాట్స్ గణిత వెబినార్: విద్యార్థుల నుంచి విశేష స్పందన

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (17:35 IST)
టెంపాబే: అమెరికాలో తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గణిత వెబినార్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికుటర్ భాను ప్రకాశ్‌తో నిర్వహిస్తున్న ఈ వెబినార్స్‌కు వేలమంది విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం అవుతున్నారు. నాట్స్ టెంపాబే విభాగంతో పాటు న్యూజెర౩౦: లోని ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా ఈ గణిత సదస్సులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నాయి.
 
తాజాగా జరిగిన సదస్సులో చిన్నచిన్న మెళకువళతో గణితంలో ఎలా పరిణితి సాధించవచ్చనే దానిని భాను ప్రకాశ్ విద్యార్ధులకు వివరించారు.. ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ పేరుతో తాను ఇస్తున్న శిక్షణ వల్ల ఎంతటి కష్టమైన సమస్యలనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు కూడా భాను ప్రకాశ్ ఈ సదస్సులో సమాధానం ఇచ్చారు. విద్యార్ధులు తమ మేథస్సుకు ఎలా పదను పెట్టుకోవచ్చు.. గణితం వల్ల మన మెదడు ఎంత చురుకుగా పనిచేస్తుందనే దానిని చక్కగా వివరించారు.
 
ఈ వెబినార్‌కు దాదాపు 1500 మందికి పైగా విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానమయ్యారు. ప్రతి వారం సరికొత్త అంశాలతో నాట్స్ ఈ వెబినార్స్ నిర్వహిస్తోంది. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్‌,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్  రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త  ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టాంపాబే చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్ బొజ్జ,ఈవెంట్స్ కో ఛైర్ నవీన్ మేడికొండ, హెల్ప్ లైన్ ఛైర్ సుమంత్ రామినేనితో పాటు ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయానికి చెందిన  సూర్యనారాయణ మద్దుల, వంశీ తమన, విశాలి, దీపా మదన్ గోపాల్, రమేశ్ తడువాయి తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
 
ఈ వెబినార్‌కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్లలకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments