Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఇండియాలో ఎంజాయ్... ఆ తర్వాత విదేశాల్లో హ్యాపీ... అలాంటి ఎన్ఆర్ఐ భర్తలకు...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:40 IST)
ఈమధ్య కాలంలో ఎన్ఆర్ఐ భర్తల మోసాలు ఎక్కువవుతుండటంతో అలాంటి సమస్యలను  పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గంలో చర్యలు తీసుకుంటోంది. భార్యలను వదిలేసి విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలియజేసారు.
 
పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల తమ భార్యలను తీసుకెళ్లకపోవడం లేదా వారిని వేధింపులకు గురి చేయడం వంటి సంఘటనలు ఎక్కువ అవుతుండటంతో అటువంటి భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా విదేశాంగ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, హోమ్ శాఖ, న్యాయ శాఖ సంయుక్తంగా ఒక బిల్లును ప్రవేశపెట్టాయి. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
 
కాగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భార్యలను మోసం చేసి వెళ్లిపోయిన భర్తలపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తుందని మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు ఆమె తెలియజేసారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments