Webdunia - Bharat's app for daily news and videos

Install App

సండే స్పెషల్.. వెన్నతో కొరమీను చేపల ఫ్రై ఎలా చేయాలంటే?

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (17:53 IST)
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. ఇవి డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. మానసిక ఆందోళనను పోగొడతాయి. అదీ కొరమీను చేపలను వారానికి ఓసారి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా దరిచేరవు. అలాంటి కొరమీనును వెన్నతో ఫ్పై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె, ఉప్పు - తగినంత
మిరియాల పొడి- ఒకటిన్నర స్పూన్ 
నిమ్మకాయ - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు- ఒక కప్పు 
 
తయారీ విధానం:
ముందుగా శుభ్రపరిచిన కొరమీను చేపల్లోని ముల్లును తీసేయాలి. ఈ మీనుకు ఒకే ఒక ముల్లు వుంటుంది. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ చేప ముక్కలకు ఉప్పు, మిరియాలపొడి, ఒక స్పూన్ నూనె చేర్చి బాగా కలిపి అర్థగంట పక్కనబెట్టేయాలి. తర్వాత బాణలిలో నూనె పోసి బాగా ఆరిన తర్వాత ఆ చేప ముక్కులను వేసి దోరగా వేపుకోవాలి. ఈ చేపల ఫ్రైని దించేటప్పుడు వెన్న రాసి, కొత్తిమీర తరుగును చేర్చి దించేయాలి. అంతే వేడి వేడి కొరమీను చేపల ఫ్రై సిద్ధమైనట్లే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments