Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరన్నవరాత్రులు స్పెషల్.. రవ్వతో కేసరి ఎలా చేయాలి..

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (19:11 IST)
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారిని మహాలక్ష్మీగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. ఆ రోజున రవ్వను నేతిలో దోరగా వేపి అమ్మవారికి కేసరిని తయారు చేసి సమర్పించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. అలాంటి రవ్వ కేసరిని ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
రవ్వ : పావు కేజీ.
పాలు : అర లీటరు
చక్కెర : పావు కేజీ
డ్రై ఫ్రూట్స్‌ : పావు కప్పు
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్‌
గుమ్మడి గింజలు : ఒక టీస్పూన్‌
యాలకుల పొడి : పావు టీస్పూన్‌
 
తయారీ విధానం:
ముందుగా నెయ్యి వేసి ఓ కడాయిలో డ్రై ఫ్రూట్స్‌ను దోరగా వేపుకుని పక్కన బెట్టుకోవాలి. ఆపై రవ్వను దోరగా వేపుకోవాలి. ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. దోరగా వేపిన రవ్వను మరుగుతున్న పాలల్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. మరో రెండు నిమిషాలు ఉంచి వేయించిన డ్రై ఫ్రూట్స్‌, గుమ్మడి గింజలు వేసి కలిపి దించేయాలి. అంతే రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

అన్నీ చూడండి

లేటెస్ట్

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

తర్వాతి కథనం
Show comments