Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరన్నవరాత్రులు.. సమర్పించాల్సిన పుష్పాలు, నైవేద్యాలు

నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మహాలయ అమావాస్యకు తర్వాత ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను అనుసరిస్తారు. అక్టోబర్ 10 (బుధవారం) నుంచి అక్టోబర్ 18 (గురువారం) వరకు శరన్నవరాత్రులు.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:25 IST)
నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మహాలయ అమావాస్యకు తర్వాత ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను అనుసరిస్తారు. అక్టోబర్ 10 (బుధవారం) నుంచి అక్టోబర్ 18 (గురువారం) వరకు శరన్నవరాత్రులు.


ఈ తొమ్మి రోజులు మహేశ్వరి, కౌమారి, వరాహి, మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణి, సరస్వతి, నరసింహీ, చాముండి అని పలు రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. అయితే శక్తి ఏక స్వరూపమే. ఈ నవదుర్గా దేవీలను మన ఇంటికి స్వాగతించి, స్తుతించడమే నవరాత్రి పర్వదినాల విశేషం. 
 
తొలి మూడు రోజులు దుర్గాదేవిని, ఆ తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మిని, చివరి మూడు రోజులు సరస్వతిని పూజించాలి. తొలిరోజున మహేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున మహేశ్వరిని మల్లెలు, బిల్వ పత్రాలతో అలంకరించుకోవాలి. ఆ రోజు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. రెండో రోజు కౌమారి రూపంలోని  దేవికి మల్లెలు, తులసీ ఆకులను సమర్పించాలి. పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. 
 
మూడో రోజు వరాహి రూపంలో దర్శనమిచ్చే దేవికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో రోజు మహాలక్ష్మి రూపంలో కొలువయ్యే అమ్మవారికి మల్లెపువ్వులతో అలంకరణ చేసి.. అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఐదో రోజు వైష్ణవికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆరో రోజు ఇంద్రాణి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి జాజిపువ్వులతో పూజ చేయాలి. ఏడో రోజున సరస్వతీ దేవికి నిమ్మకాయతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. 
 
ఎనిమిదో రోజు నరసింహీ రూపంలోని అమ్మవారికి రోజా పువ్వులతో అలంకరించుకోవాలి. తొమ్మిదో రోజు చాముడేశ్వరిగా దర్శనమిచ్చే అమ్మవారికి తామర పువ్వులు, పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అంతేగాకుండా ప్రతిరోజూ ఉడికించిన శెనగలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ఇంటికొచ్చిన వారికి వాయనం ఇవ్వాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

తర్వాతి కథనం
Show comments