Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు హయాంలో జరిగివుంటే ధర్మాడి సత్యం ఎవరో తెలిసేది కాదు : విజయసాయిరెడ్డి

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:47 IST)
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదం జరిగివుండివుంటే కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం గురించి ఈ దేశానికి తెలిసివుండేది కాదని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెలలో వశిష్ట పర్యాటకుల బోటు గోదవరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. ఈ బోటును 38 రోజుల తర్వాత విజయవంతంగా వెలికితీశారు. 
 
అయితే, దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గోదావరి నది నుంచి బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం నైపుణ్యానికి, ఆయన శ్రమకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ట్వీట్ చేశారు.
 
అయితే, ఇదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ధర్మాడి సత్యానికి పేరొచ్చేది కాదన్నారు. చంద్రబాబే బోటును వెలికితీసినట్టు ప్రచారం జరిగేదని, ధర్మాడి సత్యం పేరు ఎవరికీ తెలిసేది కాదన్నారు. చంద్రబాబే దగ్గరుండి డైవర్లకు మార్గదర్శనం చేసి గొలుసులు వేసి పడవను బయటికి లాగాడని కులమీడియా బాకాలు ఊదేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments