Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా వల్ల మెదడుకు లబ్ది చేకూరుతుంది : రాంనాథ్ కోవింద్

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (16:42 IST)
జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ యోగా డేను ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా దినోత్స‌వానికి ఒక రోజు ముందు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ యోగాపై ఓ ముఖ్య‌మైన సందేశాన్ని ఇచ్చారు. 
 
యోగా ఏ ఒక్క మ‌తానికో చెందిన‌ది కాద‌ని, ఇది మొత్తం మాన‌వాళికి చెందిన‌ద‌ని అన్నారు. యోగా వ‌ల్ల శ‌రీరానికి, మెద‌డుకు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. ఆరోగ్యం కోసం యోగా అనే ఓ ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.
 
సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా అనే సందేశాన్ని పంచుతున్న యునైటెడ్ నేష‌న్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్‌, ఇత‌ర సంస్థ‌ల‌ను ఆయ‌న అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో కోవింద్‌తోపాటు కేంద్ర ఆయుష్ స‌హాయ మంత్రి కిర‌ణ్ రిజిజు, ఆధ్యాత్మ‌క‌వేత్త క‌మ‌లేష్ ప‌టేల్‌, బ్యాడ్మింట‌న్ కోచ్ గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments