Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కింపు పూర్తికాకుండానే ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా

Webdunia
గురువారం, 21 జులై 2022 (21:53 IST)
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఈ నెల 18వ తేదీన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈ ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే ఆమె సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు. 
 
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. 
 
తాజా ఎన్నికల్లో ఓటమిని ఖరారు కాగానే విజేత ద్రౌపది ముర్ముకు ఆయన అభినందలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ముర్ముకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments