Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే తొలిసారి : వందే భారత్‌ మిషన్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (18:03 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుని పోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ ఆపరేషన్ కోసం "వందే భారత్ మిషన్‌" అనే నామకరణం చేసింది. ఈ తరహా ఆపరేషన్ చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి, పైగా అతిపెద్దది కూడా. ఈ ఆపరేషన్ ఈ నెల 7వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది.
 
ఈ ఆపరేషన్‌లో భాగంగా, అబుదాబి నుంచి 170 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం గురువారం రాత్రి కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన కేరళ ప్రభుత్వం 14 రోజుల హోం క్వారంటైన్‌కు తరలించింది. 
 
మరవైపు, సింగపూర్ నుంచి 234 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ ప్రత్యేక విమానం శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అదేవిధంగా, మొదటి విడతలో భాగంగా బంగ్లాదేశ్ నుంచి 168 మంది భారతీయులను మన దేశానికి తీసుకువస్తున్నారు. ఈ ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం బయలు దేరిందని, నేరుగా శ్రీనగర్‌లో ల్యాండ్ అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 
 
అలాగే, వివిధ ప్రపంచ దేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశీనికి తీసుకునిరానుంది. ఇందుకోసం 64 విమాన సర్వీుసులను భారత ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతోంది. కేవలం స్వదేశానికి రావాలని భావించిన వారినే ఈ విమానాల్లో తీసుకొస్తారు. విమాన ఛార్జీలను ప్రయాణికులే భరించాల్సివుంటుంది. వివిధ దేశాలకు భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ చార్జీలను కూడా కేంద్రం నిర్ణయించింది. గరిష్టంగా రూ.50 వేలు, కనిష్టంగా రూ.12 చొప్పున ఖరారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments