Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నోలో రేప్.. నాగ్‌పూర్‌లో ఫిర్యాదు... ఫ్రెండ్ చేతిలో మోసపోయిన నేపాలీ మహిళ!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ దేశానికి చెందిన ఓ మహిళ మోసపోయింది. ఓ టెక్కీతో సహా నలుగురు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైంది. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసం చేయలేకపోయింది. తనకు ఆశ్రయం కల్పించిన మహిళా స్నేహితురాలే కామాంధులతో చేతులు కలిపి మోసం చేసింది. దీంతో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన 22 యేళ్ళ మహిళ 2018లో లక్నోలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. ఆమె ప్రవీణ్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను నేపాల్ మహిళకు పరిచయం చేసింది. వీరిద్దరూ కొంతకాలం పాటు సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి ఆ మహిళకు మత్తుమందు తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం పోలీసులకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరించారు. స్నేహితురాలికి చెప్పినా పట్టించుకోలేదు. ఇక చేసేది లేక తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బాధితురాలు చేరుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెను బందోబస్తు నడుమ లక్నోకు తీసుకుని బయలుదేరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments