Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్నోలో రేప్.. నాగ్‌పూర్‌లో ఫిర్యాదు... ఫ్రెండ్ చేతిలో మోసపోయిన నేపాలీ మహిళ!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ దేశానికి చెందిన ఓ మహిళ మోసపోయింది. ఓ టెక్కీతో సహా నలుగురు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైంది. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసం చేయలేకపోయింది. తనకు ఆశ్రయం కల్పించిన మహిళా స్నేహితురాలే కామాంధులతో చేతులు కలిపి మోసం చేసింది. దీంతో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన 22 యేళ్ళ మహిళ 2018లో లక్నోలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. ఆమె ప్రవీణ్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను నేపాల్ మహిళకు పరిచయం చేసింది. వీరిద్దరూ కొంతకాలం పాటు సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి ఆ మహిళకు మత్తుమందు తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం పోలీసులకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరించారు. స్నేహితురాలికి చెప్పినా పట్టించుకోలేదు. ఇక చేసేది లేక తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బాధితురాలు చేరుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెను బందోబస్తు నడుమ లక్నోకు తీసుకుని బయలుదేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments