Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంధువులే ఆ పని చేశారు.. బాలికకు మత్తుమందు ఇచ్చి.. వీడియో తీసి..?

బంధువులే ఆ పని చేశారు.. బాలికకు మత్తుమందు ఇచ్చి.. వీడియో తీసి..?
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:22 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతిపై కొంతమంది యువకులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
కామంతో కళ్లుమూసుకుపోయిన ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయస్సు గల బాలికలను ఎత్తుకెళ్లి మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
 
బంధువులైన ఇద్దరు యువకులు పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు.. తర్వాత అదంతా వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేయడంతో.. తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ