Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళలను చంపేసిన బంకమట్టి... ఎక్కడ? ఎలా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:56 IST)
బంకమట్టి ముగ్గురు మహిళలను చంపేసింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని దేవాల్‌బాడి పంచాయతీ పరిధిలో మీర్గా అనే కొండ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంటి కోసం తెల్లటి బంక మట్టి లభ్యమవుతుంది. దీంతో స్థానికులంతా ఆ మట్టిని తెచ్చుకునేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో మట్టి కోసం వెళ్లిన ముగ్గురు మహిళలు... మృత్యువాతపడ్డారు. బంకమట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకున్న మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ అన్సారీ, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అహ్మద్‌ ముంతాజ్‌, డీఎస్పీ అరవింద్‌కుమార్‌ ఉపాధ్యాయ, సీఐ కేదార్‌నాథ్‌తో పాటు పలువురు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. జేసీబీల సహాయంతో మట్టి పెళ్లలను వెలికి తీయగా.. ముగ్గురు మహిళల మృతదేహాలు లభించాయి.
 
మృతులను నారాయణపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చైన్పూర్‌లోని కాక్రియాబాద్ టోల్ నివాసితులుగా గుర్తించారు. మృతులు షహ్నాజ్‌ బీబీ(30), జుబీడా బీవీ (25), మెహ్నాజ్‌ ఖటూన్‌ (20) ఉన్నారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జమ్తారా సదర్ హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments