Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుని భగవానుని కోసం నర్మదా నదిలో దూకిన మహిళ

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:57 IST)
ఆ కాలంలో శ్రీకృష్ణుని కోసం వేలమంది గోపికలు పరితపించి పోయారని విన్నాం. అయితే ఈ కాలంలో కూడా అలాంటి వారు అడపాదడపా దర్శనమిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన స్వాతి గౌర్ (32) శ్రీకృష్ణుని కలుసుకునేందుకు తపించిపోయిన మీరాబాయిని స్ఫూర్తిగా తీసుకుని నర్మద నదిలో దూకింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని మంగ్వారీ ప్రాంతానికి చెందిన స్వాతి వివాహితురాలు. ఎప్పుడూ శ్రీకృష్ణ నామ స్మరణలోనే ఉండేది. ఇటీవల ఆమె తన భర్త భూపేంద్రతో కలిసి బైక్‌పై షాహ్‌గంజ్ వెళుతుండగా బైక్ మీద కూర్చున్న ఆమె కృష్ణ భక్తిలో లీనమైంది. బైక్ నర్మద బ్రిడ్జి మీదకు చేరుకోగానే భర్తతో తన చెప్పు కింద పడిపోయిందని చెప్పగా భూపేంద్ర వెంటనే బైక్ ఆపాడు. తర్వాత కిందకు దిగిన స్వాతి గౌర్ నర్మదా నదిలోకి దూకేసింది. 
 
అయితే అదృష్టవశాత్తూ నదిలో నరేంద్ర కెవట్, ప్రశాంత్ కహార్ అనే ఇద్దరు జాలరులు ఉండటంతో ఆమెను ప్రాణాలతో రక్షించారు. పోలీసుల విచారణలో స్వాతి తాను శ్రీకృష్ణ భగవానుని కలుసుకునేందుకు నర్మదలో దూకినట్టు తెలిపింది. నర్మద నదిని చూడగానే తనకు శ్రీకృష్ణుని దర్శనం కలిగినట్లయ్యిందని పేర్కొంది. కాగా ఆ జాలరులు ఆమెను రక్షించి, బోటులో కూర్చోబెట్టిన సమయంలోనూ ఆమె శ్రీకృష్ణ జపం చేస్తూ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments