Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఖా'కీచక' పర్వం : ఐపీఎస్ మహిళా అధికారికి వేధింపులు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:38 IST)
దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో మొదటిస్థానంలో ఉండే తమిళనాడు రాష్ట్రంలో ఓ ఐపీఎస్ స్థాయి లేడీ ఆఫీసరుకు లైంగిక వేధింపులు తప్పలేదు. డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఆమెను లైంగికవాంఛ తీర్చాలంటూ వేధించాడు. ఇదే విషయాన్ని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. దీంతో విచారణకు ఓ కమిటీని రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఆమె ఆరోపణలపై సదరు ఉన్నతాధికారి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
 
ఇదిలావుంటే, ప్రధాని మోడీ చెన్నై పర్యటన సమయంలో ఆ అధికారిని దూరం పెట్టారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఆ బాధ్యతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని దూరం పెట్టినట్టు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అహంకారానికి ఇది నిదర్శనమని, ఇలాంటి పోలీసు అధికారులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని మెచ్చుకుంటున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం