Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని బంధించి అత్యాచారం చేసిన నకిలీ ఖాకీలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:13 IST)
ఓ యువతిని గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసునంటూ అబద్ధాలు చెప్పి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నలసోపారాలోని ప్రగతినగర్‌కు చెందిన బాధితురాలి ఇంటికి ఈ నెల 6వ తేదీన పోలీసునంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె భర్తను ఓ కేసు మీద అరెస్ట్ చేసామని, అతడిని విడిపించుకోవాలంటే తనతోపాటు రావాలని కోరాడు. దీంతో 21 యేళ్ళ యువతి అతని మాటలు నమ్మి అతని వెంట ఆటోలో ఎక్కి వెళ్లింది. 
 
ఆ తర్వాత ఉత్తర ముంబైలోని మలద్‌లో ఉన్న ఓ ఇంట్లో ఎనిమిది రోజులుపాటు బంధించాడు. ఈ దారుణానికి ఓ మహిళతోపాటు నలుగురు సహాయం చేశారు. బంధించిన ఆమెను ఇద్దరు వ్యక్తులు పదే పదే అత్యాచారం చేశారు. ఆ తర్వాత మీరా రోడ్డులో నిర్మాణంలో ఉన్న మరో ఇంటికి బదిలీ చేశారు.

అక్కడ కూడా ఆ వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఈ నెల 18 వరకూ బంధీగా ఉంచారు. 18వ తేదీన వారు ఆమెను విడిచిపెట్టగానే సరాసరి పోలీసుల వద్దకు వెళ్లింది. జరిగిందంతా వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments