Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రైల్వే స్టేషన్‌లో అలా.. ముంబై మెట్రో స్టేషన్‌లో ఇలా..? ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (22:39 IST)
నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళను కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని కలబురగి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళను రక్షించిన వెంటనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
రైలు కదులుతున్న సమయంలో మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్య మహిళ కాలు తప్పి జారిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించారు. రైలును ఆపాలని సూచనలు చేశారు. అనంతరం ఆ మహిళను రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
 
అయితే ముంబైలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ముంబై మెట్రో వన్ రైలులో తాళం వేసి ఉన్న డోర్‌లలో ఓ మహిళ దుస్తులు ఇరుక్కుపోయాయి. రైలు కదులుతుండటంతో ఆ మహిళ అలా రైలు ప్లాట్‌ఫారమ్ చివరకు ఈడ్చుకెళ్లింది.  ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో ఒక వ్యక్తి ఆమెను రక్షించడానికి ప్రయత్నించడం కూడా చూడవచ్చు, కానీ అతను విఫలమయ్యాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. లోకో పైలట్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆమెకు చికిత్స అందించేందుకు మెట్రో అధికారులు ముందుకొచ్చారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments