Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రైల్వే స్టేషన్‌లో అలా.. ముంబై మెట్రో స్టేషన్‌లో ఇలా..? ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (22:39 IST)
నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళను కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని కలబురగి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళను రక్షించిన వెంటనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
రైలు కదులుతున్న సమయంలో మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్య మహిళ కాలు తప్పి జారిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించారు. రైలును ఆపాలని సూచనలు చేశారు. అనంతరం ఆ మహిళను రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
 
అయితే ముంబైలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ముంబై మెట్రో వన్ రైలులో తాళం వేసి ఉన్న డోర్‌లలో ఓ మహిళ దుస్తులు ఇరుక్కుపోయాయి. రైలు కదులుతుండటంతో ఆ మహిళ అలా రైలు ప్లాట్‌ఫారమ్ చివరకు ఈడ్చుకెళ్లింది.  ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో ఒక వ్యక్తి ఆమెను రక్షించడానికి ప్రయత్నించడం కూడా చూడవచ్చు, కానీ అతను విఫలమయ్యాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. లోకో పైలట్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆమెకు చికిత్స అందించేందుకు మెట్రో అధికారులు ముందుకొచ్చారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments