Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత కట్నం ఇవ్వలేదనీ.. కోడలికి చేతిగోళ్లు, జుట్టును కత్తిరించిన అత్తింటివారు

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:20 IST)
వరకట్న వేధింపులకు అనేక మంది మహిళలు బలైపోతున్నారు. మరికొంతమంది మహిళలు చిత్ర హింసలకు గురవుతున్నారు. తాజాగా ఓ వివాహితను అత్తింటివారు పలురకాలుగా హింసకు గురిచేశారు. చేతిగోళ్లతో పాటు జట్టును కత్తిరించి, చావబాదారు. దీంతో ఆ మహిళ అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెను తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ దారుణ బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన 22 యేళ్ళ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.2 లక్షలతో పాటు బైక్‌ కూడా కొనివ్వాలని అత్తింటివారు డిమాండ్ చేశారు. ఇందుకు సరేనన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వాళ్లు కట్నం ఇవ్వలేకపోయారు. ఇక అప్పటి నుంచి భర్తతో పాటు.. అత్తమామలు భార్యను వేధించసాగారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇనుప రాడ్లను వేడి చేసి బాధితురాలికి వాతలు పెట్టారు. చేతిగోళ్లను, జుట్టును పూర్తిగా కత్తిరించి దారుణంగా హింసించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై పడేశారు. అయితే కాసేపటి తర్వాత మెలకువ రావడంతో బాధితురాలు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళ ప్రాధమిక చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... భర్తతో పాటు.. అత్తమామలను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments