Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత కట్నం ఇవ్వలేదనీ.. కోడలికి చేతిగోళ్లు, జుట్టును కత్తిరించిన అత్తింటివారు

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:20 IST)
వరకట్న వేధింపులకు అనేక మంది మహిళలు బలైపోతున్నారు. మరికొంతమంది మహిళలు చిత్ర హింసలకు గురవుతున్నారు. తాజాగా ఓ వివాహితను అత్తింటివారు పలురకాలుగా హింసకు గురిచేశారు. చేతిగోళ్లతో పాటు జట్టును కత్తిరించి, చావబాదారు. దీంతో ఆ మహిళ అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెను తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ దారుణ బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన 22 యేళ్ళ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.2 లక్షలతో పాటు బైక్‌ కూడా కొనివ్వాలని అత్తింటివారు డిమాండ్ చేశారు. ఇందుకు సరేనన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వాళ్లు కట్నం ఇవ్వలేకపోయారు. ఇక అప్పటి నుంచి భర్తతో పాటు.. అత్తమామలు భార్యను వేధించసాగారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇనుప రాడ్లను వేడి చేసి బాధితురాలికి వాతలు పెట్టారు. చేతిగోళ్లను, జుట్టును పూర్తిగా కత్తిరించి దారుణంగా హింసించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై పడేశారు. అయితే కాసేపటి తర్వాత మెలకువ రావడంతో బాధితురాలు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళ ప్రాధమిక చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... భర్తతో పాటు.. అత్తమామలను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments