Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా మందు దొరకలేదు.. మహిళపై కత్తులతో దాడి చేసిన రౌడీ

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (18:55 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో ఉచితంగా మద్యం లభించడం ఆగిపోయిందనే అక్కసుతో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళపై రౌడీ కత్తులతో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై, కాసిమేడుకు చెందిన సత్య పోలీసులకు తెలియకుండా దొంగతనంగా మద్యం అమ్మేది. ఈమె వద్ద ఉచితంగా మద్యం తీసుకునే తాగుతూ వచ్చాడు.. రౌడీ శ్రీధర్ (42). 
 
అయితే ఉన్నట్టుండి సత్య ఈ మద్యం అమ్మకాన్ని నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సత్య వద్ద ఉచితంగా మద్యం అందించాలని రౌడీ అడగడం.. ఆమె దొంగతనం మద్యం అమ్మడాన్ని ఆపేసినట్లు చెప్పింది. అయితే సత్యపై ఎదురింటి మహిళ మల్లికా (35) పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఈమె ఫిర్యాదు చేయడం వల్లే తనకు ఉచితంగా లభించే మద్యం ఆగిపోయిందని భావించిన రౌడీ మల్లికను కత్తులతో దాడి చేశాడు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments