ఛీ.. మెట్రో రైలులో అమ్మాయిల ముందు ఏంటీ పని?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (12:46 IST)
మెట్రో రైలే కాదు.. మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు జరుగుతూనే వున్నాయి. అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీ మెట్రో రైలులో చీదరించుకునే ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన ఓ యువతిని చూసిన ఓ యువకుడు హస్తప్రయోగం చేయడం మొదలెట్టాడు. ఈ ఘటనపై బాధిత యువతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
తాను ఎస్కలేటర్ నుంచి బయటకు వచ్చానని.. అప్పుడు ఏదో తప్పు జరుగుతుందని తనకు తోచిందని.. వెంటనే తిరిగి చూసి షాకయ్యానని యువతి వాపోయింది. తనను చూస్తూ ఓ యువకుడు హస్త ప్రయోగం చేస్తున్నాడని.. వెంటనే చెంప ఛెల్లుమనిపించానని చెప్పింది. అయితే వెంటనే ఆ యువకుడు తనను తిట్టడం మొదలెట్టాడు. 
 
అతనితో వాగ్వివాదం చేస్తుంటే ప్రయాణీకులు ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని యువతి వాపోయింది. ఇలాంటి ఘటనలు చూసేటప్పుడు మెట్రో రైలులో మహిళలకు కావాల్సింది.. ఉచిత ప్రయాణం కాదని.. భద్రతతో కూడిన ప్రయాణం అంటూ డిమాండ్ చేసింది. 
 
ఇందుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని తెలిపింది. అంతేగాకుండా తన ట్వీట్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్యాగ్ చేసింది. కాగా మెట్రో రైలులో మహిళలకు భద్రతను పెంచాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం