Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ.. మెట్రో రైలులో అమ్మాయిల ముందు ఏంటీ పని?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (12:46 IST)
మెట్రో రైలే కాదు.. మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు జరుగుతూనే వున్నాయి. అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీ మెట్రో రైలులో చీదరించుకునే ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన ఓ యువతిని చూసిన ఓ యువకుడు హస్తప్రయోగం చేయడం మొదలెట్టాడు. ఈ ఘటనపై బాధిత యువతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
తాను ఎస్కలేటర్ నుంచి బయటకు వచ్చానని.. అప్పుడు ఏదో తప్పు జరుగుతుందని తనకు తోచిందని.. వెంటనే తిరిగి చూసి షాకయ్యానని యువతి వాపోయింది. తనను చూస్తూ ఓ యువకుడు హస్త ప్రయోగం చేస్తున్నాడని.. వెంటనే చెంప ఛెల్లుమనిపించానని చెప్పింది. అయితే వెంటనే ఆ యువకుడు తనను తిట్టడం మొదలెట్టాడు. 
 
అతనితో వాగ్వివాదం చేస్తుంటే ప్రయాణీకులు ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని యువతి వాపోయింది. ఇలాంటి ఘటనలు చూసేటప్పుడు మెట్రో రైలులో మహిళలకు కావాల్సింది.. ఉచిత ప్రయాణం కాదని.. భద్రతతో కూడిన ప్రయాణం అంటూ డిమాండ్ చేసింది. 
 
ఇందుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని తెలిపింది. అంతేగాకుండా తన ట్వీట్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్యాగ్ చేసింది. కాగా మెట్రో రైలులో మహిళలకు భద్రతను పెంచాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం