Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడలేదు.. ఫిర్యాదు చేస్తే.. దాడి జరిగింది..

రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడలేదు.. ఫిర్యాదు చేస్తే.. దాడి జరిగింది..
, బుధవారం, 19 జూన్ 2019 (11:59 IST)
బుల్లితెర నటి రాగమాధురిపై దాడి జరిగింది. నల్లపూసల గొలుసు కనబడలేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. రాగమాధురి ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతికపై ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమైంది.


వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాగమాధురి నల్లపూసల గొలుసు కనిపించకుండా పోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయమై సెట్‌లోని సభ్యులను ఆమె ఆరా తీసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఫిర్యాదులో హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది రాగ మాధురి
 
ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్‌లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు. 
 
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. దీంతో రాగ మాధురి ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షూటింగ్ స్పాట్‌లో రియల్ ఫైట్...