Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యధిక విరాళాలతో నెంబర్ 1గా నిలిచిన విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (18:47 IST)
మానవ జీవింలో సంపాదించడం ఒక ఎత్తైతే, సమాజం మేలు కోసం ఆ సంపాదనను దాతృత్వ సేవకు వినియోగించడం మరో ఎత్తు. ఈ కోవలో చూస్తే విప్రో అధినేత 75 ఏళ్ల అజిమ్ ప్రేమ్‌జీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. తాజా గణాంకాల ప్రకారం కూడా అదే చెబుతున్నారు. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక విరాళాలు అందించిన వారిలో అజిమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారు.
 
ఆయన ఈ ఏడాది రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారు. అజిమ్ ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాను సమాజ సేవ కోసం అర్పించారు. ప్రస్తుతం ఆ వాటా విలువ రూ.52,750 కోట్లు. కాగా ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా జాబితాలో ప్రేమ్ జీ తర్వాత రెండో స్థానంలో హెచ్‌సీ‌ఎల్ అధినేత శివ్ నాడార్, మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ, నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా, ఐదో స్థానంలో వేదాంతా గ్రూప్ అనిల్ అగర్వాల్ ఉన్నారు.
 
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్న వయస్సు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ ఈ జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments