Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో గెలుపు బీజేపీకి బూస్టింగ్ వంటిది: కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (23:02 IST)
దుబ్బాక గెలుపుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌కు పట్టున్న దుబ్బాకలో గెలవడం తమ పార్టీకి బూస్టింగ్ వంటిదని పేర్కొన్నారు. దుబ్బాకలో గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  పనిచేయడానికి ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఎక్కడైనా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
 
దుబ్బాక, బీహార్ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. ఏపీ బీజేపీ అభ్యర్థులు సోము వీర్రాజు కుల, మతాలకు అతీతమైన విజయాన్ని ప్రజలు మోదీకి అందించారన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో ఇలాంటి విజయాలే చూస్తారన్నారు. దీంతో విజయవాడ బీజేపీ కార్యాలయం ఎదుట బాణ సంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
 
అటు 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో అధికారంలోకి వస్తామంటున్నారు. ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బీజేపీ దుబ్బాకలో మొదటిసారి విజయకేతనం ఎగురవేసింది. 14 వందల ఓట్లకు పైగా తేడాతో టీర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు ఓడించారు.
 
మొత్తం 23 రౌండ్లలో సాగిన ఓట్ల లెక్కింపులో రఘునంధన్ రావుకు 62,772 ఓట్లు రాగా సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్జికి 21,819 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో బీజేపీకి 39 శాతం, టీఆర్ఎస్‌కు 37 శాతం వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments