Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో గెలుపు బీజేపీకి బూస్టింగ్ వంటిది: కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (23:02 IST)
దుబ్బాక గెలుపుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌కు పట్టున్న దుబ్బాకలో గెలవడం తమ పార్టీకి బూస్టింగ్ వంటిదని పేర్కొన్నారు. దుబ్బాకలో గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  పనిచేయడానికి ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఎక్కడైనా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
 
దుబ్బాక, బీహార్ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. ఏపీ బీజేపీ అభ్యర్థులు సోము వీర్రాజు కుల, మతాలకు అతీతమైన విజయాన్ని ప్రజలు మోదీకి అందించారన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో ఇలాంటి విజయాలే చూస్తారన్నారు. దీంతో విజయవాడ బీజేపీ కార్యాలయం ఎదుట బాణ సంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
 
అటు 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో అధికారంలోకి వస్తామంటున్నారు. ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బీజేపీ దుబ్బాకలో మొదటిసారి విజయకేతనం ఎగురవేసింది. 14 వందల ఓట్లకు పైగా తేడాతో టీర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు ఓడించారు.
 
మొత్తం 23 రౌండ్లలో సాగిన ఓట్ల లెక్కింపులో రఘునంధన్ రావుకు 62,772 ఓట్లు రాగా సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్జికి 21,819 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో బీజేపీకి 39 శాతం, టీఆర్ఎస్‌కు 37 శాతం వచ్చాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments