Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారును పోలిన గుర్తు దుబ్బాకలో తెరాస కొంపముంచిందా?

కారును పోలిన గుర్తు దుబ్బాకలో తెరాస కొంపముంచిందా?
, మంగళవారం, 10 నవంబరు 2020 (18:54 IST)
‌ దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట‌మికి ఆ గుర్తు కార‌ణ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కారును పోలిన గుర్తును స్వ‌తంత్ర అభ్య‌ర్థికి కేటాయించారు. దీంతో దుబ్బాక ఓట‌ర్లు క‌న్ఫ్యూజ్ అయి.. కారును పోలిన సింబ‌ల్‌కు ఓటేయ‌డంతో కొంత న‌ష్టం క‌లిగి ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
 
ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,64,186 ఓట్లు పోల‌వగా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల‌య్యాయి. ఇక స్వతంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజు అనే అభ్య‌ర్థికి 3,489 ఓట్లు ప‌డ్డాయి. ఈ మూడు పార్టీల త‌ర్వాత నాగ‌రాజు నాలుగో స్థానంలో నిలిచాడు.
 
కారును పోలిన సింబ‌ల్‌ను నాగ‌రాజుకు కేటాయించ‌డంతోనే టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన ఓట్ల‌న్ని అత‌నికి ప‌డ్డాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోల‌వ్వ‌గా, అందులో 1381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యధిక విరాళాలతో నెంబర్ 1గా నిలిచిన విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ