Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు ఆదేశించాడు, రజినీకాంత్ ఆ పని చేస్తున్నాడు?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:43 IST)
వచ్చే యేడాదే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే అధికార అన్నాడిఎంకే, ప్రతిపక్ష డిఎంకే పార్టీలు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ముఖ్యంగా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అయితే ఏకంగా సభ్యత్వ నమోదుతో జనాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ మెల్లమెల్లగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మక్కల్ మండ్రం అనే తన సొంత స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు రజినీకాంత్. తన అభిమాన సంఘంతో మాట్లాడిన రజినీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారట.
 
సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే పార్టీని ప్రకటించి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట రజినీ. అయితే ఈ సభ్యత్వ నమోదు పూర్తయ్యిందే సభ్యులకు ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా సూచించారట. ఎలాంటి ఆర్భాటంగా లేకుండా ప్రశాంతంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రకటన చేయాలన్నది రజినీ ఆలోచనట. ఇదే తన సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈసారి తమిళనాడు ఎన్నికలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments