Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు ఆదేశించాడు, రజినీకాంత్ ఆ పని చేస్తున్నాడు?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:43 IST)
వచ్చే యేడాదే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే అధికార అన్నాడిఎంకే, ప్రతిపక్ష డిఎంకే పార్టీలు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ముఖ్యంగా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అయితే ఏకంగా సభ్యత్వ నమోదుతో జనాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ మెల్లమెల్లగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మక్కల్ మండ్రం అనే తన సొంత స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు రజినీకాంత్. తన అభిమాన సంఘంతో మాట్లాడిన రజినీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారట.
 
సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే పార్టీని ప్రకటించి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట రజినీ. అయితే ఈ సభ్యత్వ నమోదు పూర్తయ్యిందే సభ్యులకు ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా సూచించారట. ఎలాంటి ఆర్భాటంగా లేకుండా ప్రశాంతంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రకటన చేయాలన్నది రజినీ ఆలోచనట. ఇదే తన సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈసారి తమిళనాడు ఎన్నికలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments