Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో వచ్చే క్రైమ్ పాట్రోల్ సీరియల్ చూసి భర్తను చంపిన భార్య

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:09 IST)
ఓ మహిళ టీవీ టీవీ సీరియల్ చూసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఈ దారుణం‌ గ్వాలియర్‌‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్వాలియర్‌కు సమీపంలోని బహోదాపూర్‌కు చెందిన మమత, తన భర్త పరశురామ్ చేతిలో ఎప్పటి నుంచో వేధింపులకు గురవుతోంది. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు అనుభవిస్తోంది. 
 
ఆ వేధింపులు భరించలేక తన భర్తను చంపెయ్యాలని నిర్ణయించుకుంది. ఈ నెల 2వ తేదీన జరిగిన గొడవలో తాగి ఉన్న భర్త తలపై ఓ రాయితో మోది చంపేసింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసింది. ఆ తర్వాత బయటకు గట్టిగా అరుచుకుంటూ వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుపు మొదలుపెట్టింది. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. 
 
భర్త మృతి కారణంగా షాక్‌లోకి వెళ్లిపోయినట్టు నటించింది. మమతను చూసి అందరూ జాలి పడ్డారు. పోలీసులు కూడా ఆమె చెప్పేదే నిజమని నమ్మారు. అయితే 28 రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రావడంతో అసలు విషయం బయటపడింది. 
 
పరశురామ్ తలపై గాయం అయినట్టు తేలింది. దీంతో పోలీసులు మమతను విచారించగా ఆమె తన నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి అసలు విషయం చెప్పింది. భర్త వేధింపులు భరించలేక తానే అతడిని చంపినట్టు అంగీకరించింది. టీవీలో వచ్చే -క్రైమ్ పాట్రోల్- సీరియల్ చూసి హత్య చేసినట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments