Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో వచ్చే క్రైమ్ పాట్రోల్ సీరియల్ చూసి భర్తను చంపిన భార్య

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:09 IST)
ఓ మహిళ టీవీ టీవీ సీరియల్ చూసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఈ దారుణం‌ గ్వాలియర్‌‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్వాలియర్‌కు సమీపంలోని బహోదాపూర్‌కు చెందిన మమత, తన భర్త పరశురామ్ చేతిలో ఎప్పటి నుంచో వేధింపులకు గురవుతోంది. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు అనుభవిస్తోంది. 
 
ఆ వేధింపులు భరించలేక తన భర్తను చంపెయ్యాలని నిర్ణయించుకుంది. ఈ నెల 2వ తేదీన జరిగిన గొడవలో తాగి ఉన్న భర్త తలపై ఓ రాయితో మోది చంపేసింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసింది. ఆ తర్వాత బయటకు గట్టిగా అరుచుకుంటూ వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుపు మొదలుపెట్టింది. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. 
 
భర్త మృతి కారణంగా షాక్‌లోకి వెళ్లిపోయినట్టు నటించింది. మమతను చూసి అందరూ జాలి పడ్డారు. పోలీసులు కూడా ఆమె చెప్పేదే నిజమని నమ్మారు. అయితే 28 రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రావడంతో అసలు విషయం బయటపడింది. 
 
పరశురామ్ తలపై గాయం అయినట్టు తేలింది. దీంతో పోలీసులు మమతను విచారించగా ఆమె తన నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి అసలు విషయం చెప్పింది. భర్త వేధింపులు భరించలేక తానే అతడిని చంపినట్టు అంగీకరించింది. టీవీలో వచ్చే -క్రైమ్ పాట్రోల్- సీరియల్ చూసి హత్య చేసినట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments