Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే మహిళకు మూడు డోసుల వ్యాక్సిన్.. నిమిషాల వ్యవధిలో...

ఒకే మహిళకు మూడు డోసుల వ్యాక్సిన్.. నిమిషాల వ్యవధిలో...
, బుధవారం, 30 జూన్ 2021 (16:20 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైద్య సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకే మహిళకు కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు కరోనా డోసులు వేశారు. మహారాష్ట్రలోని థానే సిటీలో ఆరోగ్య సిబ్బింది ఓ మహిళ(28)కు ఒకే రోజు నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్వేశారు. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగిగా ప‌ని చేస్తున్న వ్య‌క్తి భార్య‌కే ఇలా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు మ‌హిళ జ‌రిగిన ఘ‌ట‌న‌ను త‌న భ‌ర్త‌కు చెప్ప‌గా.. అత‌డు స్థానిక కార్పొరేట‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. 

ఈ విష‌యంలో వెలుగులోకి రాగానే థానె మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌.. ఆ మ‌హిళ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించ‌డానికి వైద్య బృందాన్ని ఇంటికి పంపించింది. త‌న భ‌ర్త టీఎంసీలో ప‌ని చేస్తాడ‌న్న ఉద్దేశంతో తాను ఫిర్యాదు చేయాల‌ని అనుకోలేద‌ని ఆ మ‌హిళ చెప్పింది. 

త‌న భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకుంటుండ‌టం వ‌ల్ల ఈ ప్ర‌క్రియ ఎలా ఉంటుందో త‌న‌కు తెలియ‌ద‌ని ఆమె భ‌ర్త చెప్పాడు. ఆమెకు ఆ రోజు జ్వరం వ‌చ్చింద‌ని, అయితే మ‌రుస‌టి రోజు త‌గ్గిపోయి అప్ప‌టి నుంచి బాగానే ఉన్న‌ద‌ని అన్నాడు. ఆమెను ప‌రీక్షించిన వైద్య బృందం కూడా ఆ మ‌హిళ ఆరోగ్యంగానే ఉన్న‌ద‌ని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికారం అనుభవించడానికి రాలేదు.. అధికారంలోకి తెచ్చేందుకే : సీతక్క