Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీ.తివారీ కుమారుడి హత్య కేసులో భార్యే ముద్దాయి

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:29 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ముఖ్యమంత్రి ఎన్.డి.తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆయన భార్యే అపూర్వనే ప్రధాన నిందితురాలని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆమె పోలీసుసలకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 
 
ఇటీవల రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈనెల 16వ తేదీన ఆయన ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసును బుక్ చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టుతో రోహిత్‌ హత్యకు గురైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా రోహిత్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని 8 గంటల పాటు ప్రశ్నించారు. అపూర్వ, ఆమె తల్లిదండ్రులు తమ ప్రాపర్టీపై కన్నేశారని, తన కొడుకుని వారే హత్య చేసి ఉండవచ్చని ఆదివారం రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ హత్య కేసులో భార్య పాత్ర ఉన్నట్టు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments