Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు ప్రియులతో సుఖం, భర్తను మూడు ముక్కలు చేసిన భార్య..

ప్రేయసి లేదా ప్రియుడు. ఒకరి ఒక్కరే వుండటాన్ని మనం చూస్తుంటాం. కానీ ఆమెకు మాత్రం నలుగురు ప్రియులు. మరింత విడ్డూరం ఏమిటంటే... ఆమె నలుగురు ప్రియులు అంతా కలిసే వుండటం. తన ప్రియుళ్ల సుఖం కోసం భర్తను మూడు ముక్కలుగా నరికించి హత్య చేసిన దారుణమైన ఘటన ఆలస్యంగా

Webdunia
గురువారం, 10 మే 2018 (13:58 IST)
ప్రేయసి లేదా ప్రియుడు. ఒకరి ఒక్కరే వుండటాన్ని మనం చూస్తుంటాం. కానీ ఆమెకు మాత్రం నలుగురు ప్రియులు. మరింత విడ్డూరం ఏమిటంటే... ఆమె నలుగురు ప్రియులు అంతా కలిసే వుండటం. తన ప్రియుళ్ల సుఖం కోసం భర్తను మూడు ముక్కలుగా నరికించి హత్య చేసిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... గోవాలో ఈ నెల 1వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఓ సమాచారం అందించాడు. తను ఓ హత్యను కళ్లారా చూసినట్లు చెప్పాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలను కనుగొని షాక్ తిన్నారు.
 
కర్ణాటక పరిధిలోని బైల్ హోగెనల్‌కు చెందిన 38 ఏళ్ల బసవరాజ్ బారి, 30 ఏళ్ల కల్పన దంపతులు. బ్రతుకు దెరువు కోసం వీరిద్దరూ గోవాకు మకాం మార్చారు. ఈ క్రమంలో కల్పనకు రాజస్థాన్‌కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్‌కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్‌లతో స్నేహం కుదిరింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఒకళ్లు కాదు నలుగురితో ఎఫైర్ సాగిస్తుండటంతో భర్తకు అనుమానం వచ్చి నిలదీశాడు. 
 
భర్త పదేపదే హెచ్చరికలు చేస్తుండటంతో ఇక లాభంలేదని అతడిని లేపేయాలని ప్లాన్ వేసింది. ఆ క్రమంలో తన నలుగురు ప్రియులను పిలిపించి పక్కా ప్రణాళిక వేసింది. తన భర్తను తాళ్లతో కట్టేసి అంతా కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృత దేహాన్ని మూడు ముక్కలు చేసి బ్యాగులో సర్దేసి వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది కల్పన. దీనితో పొరుగునే వున్న ఓ వ్యక్తి కల్పన భర్త కనబడకపోయేసరికి విషయాన్ని పోలీసులకు తెలుపడంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుల్లో ఒకర్ని తప్ప అందర్నీ అరెస్టు చేశారు పోలీసులు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments