Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొగుడు పడకగదిలోకి రావడం లేదు, భర్తపై భార్య ఫిర్యాదు

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (21:58 IST)
భర్త బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తూ తనకు సంసారసుఖం లేకుండా చేశాడని ఓ భార్య సాక్షాత్తు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ ఘటన సంచలనంగా మారుతోంది. అహ్మదాబాద్ నగరంలోని దానిలిండా ప్రాంతానికి చెందిన ఒక మహిళ సర్గేజ్ ప్రాంతానికి చెందిన 25 యేళ్ళ యుకువడిని 2016వ సంవత్సరం మే 14వ తేదీన పెళ్ళి చేసుకుంది.
 
2018వ సంవత్సరంలో తమకు మొదటి బిడ్డ పుట్టాక భర్త తనకు పడక సుఖం లేకుండా చేస్తూ బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని వివాహితన తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు పడకగదిలోకి రమ్మని పిలిస్తే చాలు తన భర్త ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతున్నాడని.. తనను కొడుతున్నాడని భార్య పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపింది.
 
కొన్ని నెలల కిందట తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకున్నా కనీసం మందులు కూడా కొనివ్వలేదని భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త తనను పట్టించుకోవడం లేదని చెప్పడంతో పోలీసులు గృహ హింస చట్టం, వేధింపుల కింద భర్తపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments