Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు పిలిచె దోసె కోసం, అన్నదమ్ములతో కలిసి భార్య భరతం

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (17:13 IST)
ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాల్లో ఇరుక్కునే మగవారి సంఖ్య పెరుగుతోంది. కట్టుకున్న భార్యను కాదని వేరే కుంపటి పెడుతున్నారు. అటు ప్రియురాలి కుటుంబంతో పాటు ఇతడి కుటుంబాన్ని కూడా వీధిపాలు చేస్తున్నారు.
 
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్తను అతడి భార్య తన అన్నదమ్ములతో కలిసి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక బాదింది. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు లాక్కెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బందాలో ప్రభుత్వ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. మొదట ఇంట్లో భోజనం చేయడం మానేసి ప్రియురాలితో తినడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రమంగా ఉదయాన అల్పాహారం కూడా ఇంట్లో తనకుండా ఉదయాన్నే ట్రిమ్ముగా రెడీ అయిపోయి ప్రియురాలి దగ్గర వాలేస్తున్నాడు. ఇద్దరూ కలిసి హాయిగా అల్పాహారం ఆరగించేస్తున్నారు.
 
తన భర్త వరసలో రోజురోజుకీ తేడా రావడంతో ఆ ఇల్లాలు నిఘా వేసింది. ఉదయాన్నే కారులో బయలుదేరిన భర్తను అనుసరించింది. ఆ కారు ఓ హోటల్ ముందు ఆగి వుండటాన్ని గమనించింది. కారు లోపల ప్రియురాలితో కలిసి అతడు దోసె తింటూ వుండటాన్ని చూసి తన అన్నదమ్ములకు సమాచారం అందించింది. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. తనకు అన్యాయం చేస్తున్న భర్తపై దాడి చేసింది ఆ ఇల్లాలు. ఆ తర్వాత అతడిని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments