Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నుంచి దేవుడు ముఖం తిప్పుకున్నాడు.. యూపీ బైపోల్ రిజల్ట్స్‌పై సంజయ్ రౌత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆయన బుధవారం పార్లమెంట్ వద్ద స్పందిస్తూ... 'ఎస్పీ-బీఎస్పీ చేతులు కలపడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని నేను భావించడం లేదు. శ్రీరాముడిని అవమానించిన ఎస్పీ నాయకుడికి మీరు ఎర్రతివాచీ పరిచిన రోజే... దేవుడు మీ నుంచి ముఖం తిప్పుకున్నాడు...' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం రాకపోవడంతో... ఆ పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, ఎస్పీ ఎమ్మెల్యే నితిన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున జయాబచ్చన్‌ రాజ్యసభకు నామినేషన్ వేయగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలో చేరుతూ చేరుతూనే జయాబచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇపుడు ఊహించని ఫలితాలపై కమలనాథులు షాక్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments