Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నుంచి దేవుడు ముఖం తిప్పుకున్నాడు.. యూపీ బైపోల్ రిజల్ట్స్‌పై సంజయ్ రౌత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆయన బుధవారం పార్లమెంట్ వద్ద స్పందిస్తూ... 'ఎస్పీ-బీఎస్పీ చేతులు కలపడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని నేను భావించడం లేదు. శ్రీరాముడిని అవమానించిన ఎస్పీ నాయకుడికి మీరు ఎర్రతివాచీ పరిచిన రోజే... దేవుడు మీ నుంచి ముఖం తిప్పుకున్నాడు...' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం రాకపోవడంతో... ఆ పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, ఎస్పీ ఎమ్మెల్యే నితిన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున జయాబచ్చన్‌ రాజ్యసభకు నామినేషన్ వేయగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలో చేరుతూ చేరుతూనే జయాబచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇపుడు ఊహించని ఫలితాలపై కమలనాథులు షాక్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments