Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగానే : శివసేన

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన అధినేత రాజ్‌థాక్రే ప్రకటించారు.

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగానే : శివసేన
, మంగళవారం, 23 జనవరి 2018 (14:33 IST)
మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. 1990ల నుంచే భాజపా - శివసేన మధ్య పొత్తు కుదిరింది. ఈనేపథ్యంలో ఇపుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే తాము పోటీ చేయనున్నట్లు శివసేన తెలిపింది. 
 
మంగళవారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 
 
కాగా, 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనను కాదని ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ శివసేనతో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలపడగా, విపక్ష పార్టీలు పుంజుకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశం కోసం గుండె కొట్టుకుంటోంది.. తెలంగాణ కోసం రక్తమిస్తా : పవన్