Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై గొడ్డలితో దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆ వధువు ప్రాణాలతో బయటపడింది. అప్పటికీ ఆ యువతిని ఆ వివాహిత వదిలిపెట్టలే

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య
, గురువారం, 18 జనవరి 2018 (11:38 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై గొడ్డలితో దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆ వధువు ప్రాణాలతో బయటపడింది. అప్పటికీ ఆ యువతిని ఆ వివాహిత వదిలిపెట్టలేదు. వెంటపడి పట్టుకునిమరీ చితకబాదింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెళ్లి జరుగుతుండగా వరుడి మొదటి భార్య గొడ్డలితో వచ్చి వధువుపై దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంషెడ్‌పూర్‌లోని స్థానిక సుందర్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత సుబోధ్ లోహ్రాకు సునీతా లోహ్రా అనే మహిళతో ఇదివరకే వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన పూజా కర్మ్‌కార్ అనే మరో యువతితో సుబోధ్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ, పెళ్లికి మాత్రం సుబోధ్ నిరాకరించాడు. దీంతో పూజ పోలీసులను ఆశ్రయించింది.
 
రాజీ కుదిర్చిన పోలీసులు.. తమ బలంతో వారిద్దరికీ పెళ్ళి తంతు కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ విషయం సుబోధ్ మొదటి భార్య సునీతాకు తెలిసింది. దీంతో ఆమె ఒక్కసారిగా అపరకాళిగా మారి చేతిలో గొడ్డలి పట్టుకుని పెళ్లి జరుగుతున్న మండపానికి చేరుకుంది. దీంతో పెళ్లికివచ్చిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. 
 
ఆ తర్వాత వధువుపై దాడికి యత్నించింది. ఆమె తృటిలో తప్పించుకోవడంతో, ఆ తర్వాత వెంటపడిమరీ పట్టుకుని చితక్కొట్టింది. ఆమె బారి నుంచి తప్పించుకున్న పూజ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొరపెట్టుకుంది. సునీత నుంచి తనను కాపాడాల్సిందిగా వేడుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"రియల్ శివగామి"... బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన తల్లి