Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏవీ?: మోడీపై రాహుల్ ఆగ్రహం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:06 IST)
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. అనేక దేశాలతో సంబంధాలను మోడీ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాలతో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ పటిష్ట సంబంధాలను కొనసాగిస్తే…దానిని మోడీ ఇప్పుడు విచ్ఛిన్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మిత్రులు లేకుండా ఇరుగుపొరుగుతో జీవించడం అత్యంత ప్రమాదకరమని రాహుల్‌ పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా మోడీ సర్కారుపై రాహుల్‌ ధ్వజమెత్తుతూ…బంగ్లాదేశ్‌తో భారత్‌ సంబంధాలు బలహీనపడగా చైనాతో సంబంధాలు పటిష్టవంతమయ్యాయని ఓ ఆర్థికవేత్త రాసిన వ్యాసాన్ని రాహుల్‌ ట్వీట్‌కు జత చేశారు.

ఇరుగుపొరుగుతో మైత్రీబంధం లేకపోతే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది. పొరుగుదేశాలతో భారత్‌ సంబంధాలు బలహీనపడ్డాయని ఆక్షేపించింది.

ఈ ఆరోపణలను మోడీ సర్కారు తోసిపుచ్చింది. చాలా దేశాలతో భారత్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని, ప్రపంచంలో భారత్‌ శక్తివంతంగా తయారవుతుందని కేంద్రం చెప్పుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments