Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.14 వేలు ఖర్చు చేసి 5 ఎలుకలు చంపుతున్న రైల్వే శాఖ!

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (12:55 IST)
ప్రపంచంలోని రెండో పెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. అలాంటి రైళ్ళలో ప్రయాణికుల బోగీల్లో మాత్రం దుర్వాసన వస్తుంటుంది. దీనికితోడు ఎలుకలు రాజ్యమేలుతుంటాయి. ఈ ఎలుకల బెడదకు పలు సందర్భాల్లో రైళ్ళను కొన్నిగంటల పాటు నిలిపివేసిన సందర్భాలు లేకపోలేదు. 
 
అంతేకాకుండా, రైళ్లు పట్టాలపై సాఫీగా పరుగులు పెట్టాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. వీటిలో ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. ఈ సిగ్నల్ కోసం వేల వైర్లు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి. 
 
ఈ నేపథ్యంలో ఎలుకలను అంతమొందించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంటుంది. పశ్చిమ రైల్వే గడచిన మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు కోటిన్నర రూపాయలను ఖర్చుచేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ రైల్వేశాఖ ఇన్నాళ్లలో కేవలం 5,457 ఎలుకలను మాత్రం చంపగలిగింది. ఈ లెక్కన ఎలుకల నియంత్రణకు రోజుకు రూ.14 వేలు ఖర్చు చేస్తూ, కేవలం 5 ఎలుకలను చంపగలుగుతోందని తేలింది. ఆర్టీఐ నుంచి వచ్చిన ప్రశ్నకు పశ్చిమరైల్వే ఈ విధమైన సమాధానమిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments