Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.14 వేలు ఖర్చు చేసి 5 ఎలుకలు చంపుతున్న రైల్వే శాఖ!

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (12:55 IST)
ప్రపంచంలోని రెండో పెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. అలాంటి రైళ్ళలో ప్రయాణికుల బోగీల్లో మాత్రం దుర్వాసన వస్తుంటుంది. దీనికితోడు ఎలుకలు రాజ్యమేలుతుంటాయి. ఈ ఎలుకల బెడదకు పలు సందర్భాల్లో రైళ్ళను కొన్నిగంటల పాటు నిలిపివేసిన సందర్భాలు లేకపోలేదు. 
 
అంతేకాకుండా, రైళ్లు పట్టాలపై సాఫీగా పరుగులు పెట్టాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. వీటిలో ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. ఈ సిగ్నల్ కోసం వేల వైర్లు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి. 
 
ఈ నేపథ్యంలో ఎలుకలను అంతమొందించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంటుంది. పశ్చిమ రైల్వే గడచిన మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు కోటిన్నర రూపాయలను ఖర్చుచేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ రైల్వేశాఖ ఇన్నాళ్లలో కేవలం 5,457 ఎలుకలను మాత్రం చంపగలిగింది. ఈ లెక్కన ఎలుకల నియంత్రణకు రోజుకు రూ.14 వేలు ఖర్చు చేస్తూ, కేవలం 5 ఎలుకలను చంపగలుగుతోందని తేలింది. ఆర్టీఐ నుంచి వచ్చిన ప్రశ్నకు పశ్చిమరైల్వే ఈ విధమైన సమాధానమిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments