Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సీరీస్ పిచ్చి , 75 మంది ప్రాణాలను కాపాడింది, ఎక్కడ, ఎలా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:43 IST)
సాధారణంగా కొందరు సినిమాలపై మోజు పెంచుకుంటూ అందులోనే నిమగ్నమై పోతుంటారు. దీనికోసం తమ సమయాన్ని లెక్క పెట్టకుండా కాలయాపన చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వెబ్ సీరీస్ పైన పెంచుకున్న మోజు చివరికి 75 మంది ప్రాణాలను రక్షించింది. అసలు వెబ్ సీరీస్ వల్ల ప్రాణాలు కాపాడడం ఎలా అని కొందరు తికమకలవుతారు కానీ ఇది నిజమని నిరూపించాడు ఓ యువకుడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్రలో దొంబివిలి, కాపర్ ఏరియాకు చెందిన కునాల్ అనే యువకుడికి వెబ్ సీరీస్ అంటే పిచ్చి. రాత్రింబవళ్లు లెక్క చెయ్యకుండా చూస్తుంటాడు. అతడు బుధవారం రాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు చూస్తున్నాడు. ఈ క్రమంలో తానుండే రెండంతస్థుల భవనంలో ఓ భాగం కూలిపోవడం గమనించాడు.
 
దీంతో అప్రమత్తమై ఆ భవనంలో నిద్రిస్తున్న 75 మందిని లేపి అప్రమత్తం చేశాడు. అందరూ భయపడి పరుగులు పెడుతూ బయటికి వచ్చేశారు. చూస్తున్న సమయంలోనే ఆ భవనం కుప్ప కూలిపోయింది. కానీ శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని ఖాళీ చెయ్యమని అధికారులు తొమ్మిది నెలలకు ముందే నోటీసులు జారీ చేశారు. 75 మంది ప్రాణాలను రక్షించిన కునాల్‌ను అందరూ మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments