యువతను పక్కదోవ పట్టిస్తున్న నక్సలిజం : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:59 IST)
దేశంలోని యువతను నక్సలిజం పక్కదోవ పట్టిస్తుందని, అందువల్ల దాని అంతు చూడాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని ఆయన సూచించారు. అదేసమయంలో  సోషల్ మీడియాను తక్కువ అంచనా వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ సారథ్యంలో అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో జరిగిన చింతన్ శిబిరం (మేధోమథన సదస్సు)లో భాగంగా శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. యువత భావోద్వేగాలను వాడుకుని దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు యత్నించేవారిని ఓడించేందుకు మన బలగాలు మేధోశక్తిని పెంచుకోవాలని కోరారు. 
 
పోలీస్ స్టేషన్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని, దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోస్ట్ బాక్స్‌ను ఎలా గుర్తు పట్టగలమో అదే విధంగా పోలీస్ యూనిఫాంను కూడా గుర్తించగలిగేలా ఉండాలన్నారు. 
 
సోషల్ మీడియాను తక్కువ అంచనా వేయొద్దన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని చెప్పారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు పదిసార్లు చెక్ చేసుకోవాలని ప్రధాని మోడి విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments