Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్ణీత సమయానికి ముందుగానే వచ్చిన రైలు.. డ్యాన్స్ చేసిన ప్రయాణికులు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (13:33 IST)
సాధారణంగా దేశంలో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తాయనే ప్రచారం ఉంది. "నేను ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు" అని ప్రముఖ సినీ కవి ఆరుద్ర అన్నారు కూడా. అనేక సందర్భాల్లో భారతీయ రైళ్ళ రాకపోకలను చూస్తే ఇది నిజమేనని నిరూపితమైన సంఘటనలు అనేక ఉన్నాయి. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. నిర్ణీత సమయం లేదా దానికంటే ముందుగానే రైళ్లు స్టేషన్లకు వచ్చి ఆగుతున్నాయి. 
 
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ రైలు నిర్ణీత సమయానికంటే 20 నిమిషాలు ముందుగా వచ్చి ఆగింది. బాంద్రా - హరిద్వార్ రైలు రాత్రి 10.35 గంటలకు స్టేషన్‌కు వచ్చి 10 నిమిషాలు ఆగుతుంది. కానీ, బుధవారం రాత్రి ఈ రైలు ఏకంగా 20 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు వచ్చి ఆగింది. 
 
దీంతో ప్రయాణికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులయ్యారు. స్టేషన్‌లో 30 నిమిషాల పాటు రైలు ఆగడంతో ప్రయాణికులంతా రైలు దిగి ఆ రాష్ట్ర సంప్రదాయ గర్భా నృత్యంతో ఆలరించారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments