Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యారు : మంత్రి హరీష్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (12:02 IST)
తెలంగాణాలో ఒక కుటుంబ పాలన సాగుతోందంటూ గురువారం హైదరాబాద్‌ నగర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఘాటుగానే స్పందించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వచ్చిన ప్రధాని చిల్లర మాటలు మాట్లాడారంటూ మండిపడ్డారు. 
 
మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే పొత్తుపెట్టుకున్న విషయాన్ని ప్రధాని మోడీ మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. మోడీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి ఎలా అయ్యారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోడీకి లేదన్నారు. తెలంగాణాను ఒక కుటుంబంలా సీఎం కేసీఆర్ భావించి పాలిస్తున్నారన్నారు. 
 
కాగా, ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ-హైదరాబాద్) ద్వి దశాబ్ది వేడుకలు గురువారం జరుగగా, ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఓ కుటుంబ పాలన సాగుతోందన్న సంగతి యాతవ్ దేశం గమనిస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments