Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యారు : మంత్రి హరీష్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (12:02 IST)
తెలంగాణాలో ఒక కుటుంబ పాలన సాగుతోందంటూ గురువారం హైదరాబాద్‌ నగర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఘాటుగానే స్పందించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వచ్చిన ప్రధాని చిల్లర మాటలు మాట్లాడారంటూ మండిపడ్డారు. 
 
మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే పొత్తుపెట్టుకున్న విషయాన్ని ప్రధాని మోడీ మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. మోడీ నోట కుటుంబ పాలన మాట రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి ఎలా అయ్యారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోడీకి లేదన్నారు. తెలంగాణాను ఒక కుటుంబంలా సీఎం కేసీఆర్ భావించి పాలిస్తున్నారన్నారు. 
 
కాగా, ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ-హైదరాబాద్) ద్వి దశాబ్ది వేడుకలు గురువారం జరుగగా, ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఓ కుటుంబ పాలన సాగుతోందన్న సంగతి యాతవ్ దేశం గమనిస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments