Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్‌పై పడిన చిన్నారి... దూసుకెళ్లిన రైలు.. (Video)

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (09:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఒక యేడాది వయసున్న చిన్నారి ట్రాక్‌పై పడిపోయింది. అంతలోనే ఆ చిన్నారి పైనుంచి ఓ రైలు దూసుకెళ్లింది. అయినప్పటికీ ఆ పాప చిన్నపాటి గాయంకూడా లేకుండా ప్రాణాలతో బయటపడింది. దీనితాలుకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ జంట తమ ఏడాది వయసున్న చిన్నారితో మధుర రైల్వే స్టేషన్ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచివున్నారు. పాప చేతిని తల్లి పట్టుకునివుంది. ఇంతలో వెనుక నుంచి ఆ మహిళను ఎవరో తగిలారు. దీంతో చేతిలోనుంచి పాప జారి రైలు పట్టాలకు ఫ్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. 
 
చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఓ రైలు వైగంగా పాప పడిన ట్రాక్‌పైనే దూసుకెళ్లింది. అంతే.. ఒక్క క్షణం ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ బిగ్గరగా కేకలు పెట్టారు. పాప ఇక లేరని అంతా టెన్షన్ పడిపోయారు. కానీ, రైలు వెళ్లిపోయిన అనంతరం ఆ పాప బిగ్గరకా ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఓ వ్యక్తి పట్టాలపైకి దూకి చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆ చిన్నారికి చిన్నపాటి గాయం కూడా లేకుండా బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతూ ఊపిరిపీల్చుకున్నారు.


 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments