Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం.. యోగా చేశాడు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (10:35 IST)
Kerala Man
రోడ్లు అధ్వానంగా వుండటంతో కేరళ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఈ మేరకు హంజా పొరాలి అనే కేరళ వ్యక్తి రోడ్లు ఎంత దారుణం ఉ‍న్నాయో అధికారులకు తెలియజేసేలా అతను బురద నీటితో స్నానం చేయడమే కాకుండా ఆ బురద నీటిలోనే యోగాసనాలు వేశాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో చోటు చేసుకుంది. ఈ నిరసనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అదే సమయంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే లతిఫ్‌ రావడం, చూడటం జరిగింది. ఆయన ఏం మాట్లాడకుండా తన కారుని ఆ వ్యక్తి నుంచి తప్పించి వెళ్లిపోతున్నారు. 
 
అయినా సరే సదరు వ్యక్తి వదలకుండా ఆయన కారు వెళ్తున్న దారి వైపుగా ఉన్న గుంతల రోడ్డుకి అడ్డుపడుతూ.. ఆ బురద నీటిలోనే యోగా భంగిమలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈ గుంతల రోడ్డు కారణంగానే ఇటీవలే ఎర్నాకులం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద 52 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడుని ట్రక్‌ ఢీ కొని చనిపోయాడు.
 
దీంతో సదరు హంజా పోరాలి అధికారులు స్పదించే విధంగా ఈ వింత నిరసనను చేపట్టాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో కేరళ హైకోర్టు వెంటనే ఈ విషయమై స్పందించి.... సుమోటోగా ఈ కేసును పరిగణలోని తీసుకుంది. తక్షణమే గుంతలను పూడ్చాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments