Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (13:50 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టంది. అయితే, ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమై ఆందోళనకు దిగాయి. బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. దాదావు 8 గంటల పాటు చర్చ జరిపిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఎలాగైనా ఈ బిల్లును సభలో ఆమోదింపజేసుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. అలాగే, విపక్షాలు కూడా ఈ బిల్లును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. 
 
ఈ వక్ఫ్ సవరణ బిల్లులో వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్ర రూపొందించింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేపట్టింది. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేసినట్టు కేంద్రం వాదిస్తుంది. నిజానికి గత యేడాది ఆగస్టు నెలలోనే లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. 
 
అపుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనతో బిల్లుకు ఆమోదం తెలుపడంతో బుధవారం సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంద. అయితే, పార్లమెంట్ ఉభయసభల్లో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కమలనాథులు గట్టిగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం