Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (13:18 IST)
నెలకు కేవలం 15 వేల రూపాయలను సంపాదించే ఓ పారిశుద్ధ్య కార్మికుడుకి ఆదాయపన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఏకంగా రూ.34 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను స్వీకరించిన ఆ కార్మికుడు ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన కరణ్ కుమార్ అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే, అతడికి ఆదాయపన్ను విభాగం అధికారుల నుంచి నోటీసులు అందాయి. కానీ, వాటిలో ఏముందో అతడికి అర్థంకాకపోవడంతో విద్యావంతులను అడిగి అసలు విషయం తెలుసుకుని ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. 
 
2019-20లో కరణ్ రూ.34 కోట్ల ఆదాయాన్ని అర్జించాడు. ఆ యేడాదికి ఎలాంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు" అని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, కరణ్ కుమార్ మాత్రం ఆగ్రాలోని ఖైర్‌లో ఉన్న ఎస్.బి.ఐ శాఖలో పారిశుద్ధ్యం కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తన జీతం నెలకు రూ.15 వేలు మాత్రమేనని వెల్లడించారు. అతని పాన్ కార్డు వివరాలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల అలీగఢ్‌కు చెందిన జ్యూస్ సెంటర్ వ్యాపారికి రూ.7.5 కోట్లు చెల్లించాలని నోటీసులు అందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments