Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

Advertiesment
prof knageswhar

ఠాగూర్

, శుక్రవారం, 21 మార్చి 2025 (15:07 IST)
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తనకున్న సమాచారం మేరకు ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మంది లోక్‌సభ సభ్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏమైనా నక్రాలు చేస్తే టీడీపీతో బీజేపీ కటీఫ్ చేసుకుని, ఆ తర్వాత ఆ 10 మంది ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. పైగా, 21 మంది ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇందులో టీడీపీకి 16 మంది, జనసేన పార్టీకి ఇద్దరు, బీజేపీకి ముగ్గురు చొప్పున ఎంపీలు ఉన్నారు. మరో నాలుగు స్థానాలను వైకాపా గెలుచుకున్న విషయం తెల్సిందే. అలాగే, 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి 164 సీట్లను, వైకాపా 11 సీట్లను గెలుచుకున్నాయి. 
నేను ఓపెన్ గా చెప్తున్నా!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!