Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారామిలటరీలో వీఆర్‌ఎస్‌లు అధికమే

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:21 IST)
దిల్లీ: కేంద్ర హోం శాఖ పరిధిలోని బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి ఆరు పారామిలటరీ దళాల్లో స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు అధికంగానే ఉంటున్నాయి. ఇందుకుగల కారణాలపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయించలేదు.

గత దశాబ్దం 2011-2020లో 81,007 మంది స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారు. 2017లో అత్యధికంగా 11,728 మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఇదే సమయంలో 15,904 మంది రాజీనామా చేశారు. 2013లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ఆ ఒక్క ఏడాదే 2,332 మంది ఉద్యోగాలను విడిచిపెట్టారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలు, ఉన్నత ఉద్యోగాలు లభించడం వంటివి ఇందుకు కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.

బలగాల వారీగా పరిశీలిస్తే బీఎస్‌ఎఫ్‌ నుంచి రాజీనామాలు, వీఆర్‌ఎస్‌లు అధికంగా ఉంటున్నాయి. తరువాత స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ ఉంది. ఈ రెంటింటితో పాటు సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ను కూడా పారామిలటరీ దళాలుగా వ్యవహరిస్తుంటారు. వాటి బలగం దాదాపు పది లక్షల వరకు ఉంటుంది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments